Wednesday, May 1, 2024

Breaking: ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం..

దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. లాయర్స్ బ్లాక్ లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. లాయర్ల దుస్తుల్లోనే వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా ఫైరింగ్ చేశారు. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో ఓ మహిళా లాయర్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళా లాయర్ కు తీవ్రగాయాలయ్యాయి. కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియక లాయర్స్ బ్లాక్ లో ఉన్న వారు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement