Tuesday, April 30, 2024

Big Breaking | హైదరాబాద్​లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. భూమి విషయంలో ఘర్షణ

హైదరాబాద్​లోని పాతబస్తీలో శనివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చెలరేగింది. మీర్​చౌక్​ ఏరియాలో ఇంటి కొనుగోలు విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు తొలుత కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మక్సూద్​ అనే వ్యక్తి ఎయిర్​ గన్​తో గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో మీర్​ చౌక్​ ఏరియాలో భయాందోళనతో ప్రజలు వణికిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement