Saturday, May 11, 2024

అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ దిగ్భ్రాంతి-మృతుల కుటుంబాల‌కి రూ.2ల‌క్ష‌లు..గాయ‌ప‌డిన వారికి రూ.50వేలు

రూబీ లాడ్జిలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. లాడ్జి సెల్లార్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో బ్యాటరీ పేలడంతో సికింద్రాబాద్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లాడ్జిలో ఉన్న టూరిస్టుల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని వెల్లడించారు.ఈ మేర‌కు ప్ర‌ధాని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement