Monday, April 29, 2024

క్యాసినో నిర్వహిస్తున్న హోటల్ లో అగ్నిప్రమాదం..19మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్

క్యాసినో నిర్వహిస్తున్న హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కాంబోడియా అధికారులు వెల్లడించారు. కాంబోడియా-థాయిలాండ్‌ సరిహద్దులోగల పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ క్యాసినోలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకే పెరుగుతుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. దాదాపు 120 మందికి పైగా ఈ ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

క్యాసినో నిర్వహిస్తున్న ఆ హోటల్‌లో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 1000 మందికి పైగా ఉన్నట్లు అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. మంటలను ఆర్పడానికి 11 ఫైరింజన్‌లను వినియోగించారు. ప్రమాదం నుంచి మొత్తం 700 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం సమయంలో పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసిందని, పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో హోటల్‌లో చిక్కుకున్న వారు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారని, కొందరు ప్రాణాలను కాపాడుకోవడానికి హోటల్‌ నుంచి బయటికి దూకి తీవ్ర గాయాలపాలయ్యారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం థాయ్‌లోని వివిధ ఆస్పపత్రుల్లో 79 మంది థాయ్‌ దేశీయులు, 30 మంది కాంబోడియన్లు, 8 మంది ఇండోనేషియన్లు చికిత్స పొందుతున్నట్లు థాయ్ విదేశాంగ శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement