Monday, April 29, 2024

Breaking: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఏబీ 3 బ్లాక్ లో విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే విద్యార్థిని అపస్మారక స్థితిలో ఉండగా ఆస్పత్రికి తరలించారు. భైంసా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతిచెందింది. మృతురాలి స్వస్థలం సంగారెడ్డి జిల్లా గోరెకల్. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని పీయూసీ వన్ విద్యార్థి దీపిక. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement