తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వరకు ఆన్ లైన్ లో కూడా విద్యాబోధనని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. అయినా ఆన్ లైన్ లో కూడా విద్యాబోధన కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ప్రత్యక్ష తరగతులతో పాటు, ఆన్ లైన్ క్లాసులు కూడా కొనసాగాలని తెలిపింది. కరోనా ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. బార్లు, రెస్టారెంట్లు, మార్కెట్ల వద్ద కూడా కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మక్క, సారక్క జాతరలో కూడా కరోనా వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..