Friday, May 10, 2024

ఘోర రోడ్డుప్రమాదం…ఆరుగురు దుర్మరణం

ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‎లో జరిగింది. బలరాంపూర్ లో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదం శ్రీ దత్తగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డియోరియా మలుపు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement