Thursday, April 25, 2024

స‌త్తా చాటిన భార‌తీయ రైతులు..కేటీఆర్ ట్వీట్..

భార‌తీయ రైతులు మ‌రోసారి త‌మ స‌త్తాను చాటార‌ని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అవిశ్రాంత పోరాటం వ‌ల్ల త‌మ డిమాండ్ల‌ను సాధించుకున్నార‌ని ట్వీట్ చేశారు. ఆ కామెంట్‌కు ఆయ‌న విజ‌య‌సూచిక ఉన్న ఎమోజీని కూడా పోస్టు చేశారు. జైకిసాన్, జై జ‌వాన్‌ అంటూ త‌న ట్వీట్‌లో మంత్రి కామెంట్ చేశారు. ఫార్మ్‌లాస్‌రిపీల్డ్‌, టీఆర్ఎస్ విత్ ఫార్మ‌ర్స్‌, ఫార్మ‌ర్స్ ప్రొటెస్ట్ హ్యాష్‌ట్యాగ్‌ల‌ను కూడా మంత్రి త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు. నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు నేడు ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. కేటీఆర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నవారి శ‌క్తి క‌న్నా.. ప్ర‌జాశ‌క్తియే ఎప్ప‌టికీ గొప్ప‌ద‌ని మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement