Saturday, May 4, 2024

ప్ర‌ధాని మోడీని క‌లిసేందుకు.. ఫ్లైట్ బుక్ చేసిన ఫ్యాన్స్

ప్ర‌ధాని మోడీని క‌లిసేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు ఆయ‌న ఫ్యాన్స్. కాగా మోడీ రీసెంట్ గా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. మోడీని క‌లిసేందుకు మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్ర‌త్యేక విమానంలో ప్రయాణించారు ఫ్యాన్స్. తాము ప్రయాణించిన విమానానికి మోడీ ఎయిర్ వేస్ అని పేరుపెట్టుకున్నారు. మోడీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పొరా ఫౌండేషన్ (ఐఏడీఎఫ్) సిడ్నీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే మెల్ బోర్న్ లోని మోడీ మద్దతుదారులు, అభిమానులు కూడా సిడ్నీకి బయలుదేరారు. ఐఏడీఎఫ్ సభ్యులు 170 మంది కలిసి ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకున్నారు. మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తూ వాళ్లు చేసిన హడావుడి మామూలుగా లేదు. చేతిలో మువ్వన్నెల జెండా, టర్బన్లతో విమానంలో డ్యాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోతోంది. ఆయన ఏ దేశానికి వెళ్లినా అక్కడున్న భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో కలిసేందుకు వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement