Thursday, April 25, 2024

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులులో తెలంగాణ యువ‌కుడు..కోటి గెల్చుకున్నాడా..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్ రియాల్టీ షో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు. ఈ షోకి ఎన‌లేని ఆద‌ర‌ణ ల‌భిస్తోంది..సినీ సెల‌బ్రిటీలు ఈ షోలో సంద‌డి చేస్తున్నారు. కాగా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన యువకుడు కోటి రూపాయలు గెలుచుకున్నట్టు స‌మాచాం. జిల్లాలోని సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్రను ఈ అదృష్టం వరించినట్టు రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజారవీంద్ర ఈ షోలోని మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి కోటి రూపాయలు గెలుచుకున్నట్టు సమాచారం. హోస్ట్ ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న సంధించగా రాజారవీంద్ర సమాధానం చెప్పి దానిని ఫిక్స్ చేయమనడం ప్రోమోలో కనిపిస్తోంది. ఇప్పుడీ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ షో రేపు ప్రసారం కావాల్సి ఉండగా, రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న విషయంపై షో నిర్వాహకులు ఇంకా పెదవి విప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement