Wednesday, May 1, 2024

Espionage case | హనీ ట్రాప్​లో డీఆర్డీవో డైరెక్టర్​.. భారత కీలక సమాచారం పాక్​కి చేరవేత!

భారతదేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్​ సీక్రెట్​ ఏజెంట్​కు చేరవేశారన్న ఆరోపణలపై డీఆర్డీవో సైంటిస్టు డాక్టర్​ ప్రదీప్​ కురుల్కర్ అరెస్టు అయ్యారు. కాగా, ఇవ్వాల (మంగళవారం) ఫుణేలోని స్పెషల్​ కోర్టు కురుల్కర్​ను మే 29 వరకు జ్యుడీషియల్​ కస్టడీలోకి (రిమాండ్​) తీసుకోవాలని ఆదేశించింది. అయితే కురుల్కర్​తో పాటు మరో ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ (ఐఏఎఫ్​) కీలక అధికారి దీని వెనకాల ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్​ (ఏటీఎస్​) హనీ ట్రాప్​గా భావిస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

పాకిస్థాన్ ఏజెంట్‌కు సెన్సిటివ్​, సీక్రెట్​ ఇన్​ఫర్​మేషన్​ అందించినందుకు గాను డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కురుల్కర్‌కు ఫుణె స్పెషల్​ కోర్టు రిమాండ్​ విధించింది. మే 29 వరకు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, మే 3వ తేదీన కురుల్కర్‌ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. కురుల్కర్​ పూణేలోని DRDO ల్యాబ్‌లో డైరెక్టర్​గా పనిచేస్తున్నారు.

అయితే.. విచారణలో ఉండగా.. కురుల్కర్ కొన్ని మందులు, ఇంట్లో వండిన భోజనం కావాలని కోర్టుని అడిగారు. తాను హై బ్లడ్​ షుగర్​తో బాధపడుతున్నానని కోర్టుకు విన్నవించారు. కాగా, కోర్టు అతనికి మందులు తీసుకోవడానికి పర్మిషన్​ అయితే ఇచ్చింది కానీ, ఇంటి ఫుడ్​ కోసం అనుమతి ఇవ్వలేదు. దీంతో అతడిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది.

ఇక.. ఈ కేసులో కురుల్కర్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రాసిక్యూషన్ పేర్కొనడంతో..  ప్రత్యేక కోర్టు అతని కస్టడీని పొడిగించింది. వాట్సాప్, వీడియో కాల్స్ సహాయంతో శాస్త్రవేత్త “పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్” (PIO) ఏజెంట్‌తో సన్నిహితంగా ఉన్నారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్​ (ATS) అధికారి గత వారం పేర్కొన్నారు. ఇది హనీట్రాప్ కేసుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

సైంటిస్టు కురుల్కర్‌ను అరెస్టు చేసిన తర్వాత పలు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులకు భారతీయ సంతతికి చెందిన వ్యక్తి (పిఐఓ) ఏజెంట్ సందేశం పంపిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ అంతకుముందు కోర్టుకు తెలిపింది. దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ను ఉపయోగించి, కురుల్కర్ ఐదు నుండి ఆరు దేశాలకు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ పర్యటనల సమయంలో అతను ఎవరెవరిని కలిశాడని ప్రాసిక్యూషన్ ప్రశ్నించింది.

మరోవైపు.. ఓ మీడియా కథనాల మేరకు.. కురుల్కర్‌తో టచ్‌లో ఉన్న PIO ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) దర్యాప్తులో వెల్లడైంది. అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP)ని ఉపయోగించి PIO బెంగళూరుకు చెందిన IAF అధికారిని సంప్రదించినట్లు ATS తన నివేదికలో కోర్టుకు తెలియజేసింది. అయితే ఆ అధికారి నిఖిల్ షెండేగా గుర్తించారు. కానీ, అతని అధికారిక ర్యాంక్ ఇంకా వెల్లడించలేదు. ఇప్పటి వరకు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) మాత్రం దీనిపై స్పందించలేదు.

DRDO scientist Dr Pradeep Kurulkar. (Photo credit: ANI)

Advertisement

తాజా వార్తలు

Advertisement