Wednesday, May 15, 2024

లాభాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్స్

నేటి స్టాక్ మార్కెట్స్ లాభాల‌తో ముగిశాయి. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ చివరకు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు లాభపడి 51,597కి పెరిగింది. నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకుని 15,350 వద్ద స్థిరపడింది. హిందుస్థాన్ యూనిలీవర్ (3.94%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.84%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.13%), ఏసియన్ పెయింట్స్ (2.96%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.47%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టాటా స్టీల్ (-5.03%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.60%), రిలయన్స్ (-1.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.57%), ఎన్టీపీసీ (-1.57%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement