Monday, April 29, 2024

న‌ష్టాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్స్

నేటి స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకోలేదు. ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలహీనపరిచాయి. దీంతో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 497 పాయింట్లు నష్టపోయి 55,268కి పడిపోయింది. నిఫ్టీ 147 పాయింట్లు కోల్పోయి 16,483కి దిగజారింది. బజాజ్ ఫిన్ సర్వ్ (5.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.47%), భారతి ఎయిర్ టెల్ (0.63%), బజాజ్ ఫైనాన్స్ (0.46%), ఐటీసీ (0.42%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. ఇన్ఫోసిస్ (-3.45%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.98%), యాక్సిస్ బ్యాంక్ (-2.93%), డాక్టర్ రెడ్డీస్ (-2.75%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.28%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement