Monday, April 29, 2024

జ‌మ్మూ కాశ్మీర్ లో మ‌రో ఎన్ కౌంట‌ర్ – ముగ్గురు ఉగ్ర‌వాదులు మృతి

రీసెంట్ గా జ‌మ్మూకాశ్మీర్ లో మ‌రో ఎన్ కౌంట‌ర్ చోటు చేసుకుంది. బుద్గామ్ లోని జోల్వాక్రాల్ పోరా చ‌దూరా ప్రాంతంలో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో ముగ్గురు ఉగ్ర‌వాదులు మృతి చెందారు. గత నాలుగు రోజుల కాలంలో ఇది మూడో ఎన్ కౌంటర్. ఒక రోజు క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువైన క్రమంలో భద్రతా దళాలు అప్రమత్తంగా అవుతున్నాయి. కాగా మృతి చెందిన వారంతా జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన వారే. మృతుల్లో ఒక‌రిని శ్రీన‌గ‌ర్ సిటీకి చెందిన వ‌సీమ్ గా గుర్తించారు. మిగ‌తా ఇద్ద‌రు ఎవ‌ర‌న్న‌ది ఆరా తీస్తున్నారు. ఘటన స్థలం నుంచి మూడు ఏకే 56 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement