Monday, April 29, 2024

ట్విట్ట‌ర్ సీఈవోగా ఎలాన్ మ‌స్క్.. పెంపుడు శున‌కం

త‌న పెంపుడు శున‌కానికి సీఈవో పోస్ట్ ని క‌ట్ట‌పెడుతున్న‌ట్లు తెలిపాడు ఎలాన్ మ‌స్క్.. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక ఎలాన్ మస్క్ సంచలన మార్పులు చేసిన విషయం తెలిసిందే. కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించి సీఈవో బాధ్యతలను మస్క్ చేపట్టారు. తనకన్నా మంచి సీఈవో కోసం వెతుకుతున్నట్లు ప్రకటించిన మస్క్.. చివరకు తన పెంపుడు శునకం ఫ్లోకికి ఆ పోస్టు కట్టబెడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఫ్లోకీ ట్విట్టర్ సీఈవో బాధ్యతలను స్వీకరించిందంటూ మస్క్ ట్వీట్ చేశారు.
ఇకపై ట్విట్టర్ సీఈవో బాధ్యతలను ఫ్లోకి చూసుకుంటుందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన పెంపుడు శునకం ఫ్లోకికి మెడ దగ్గర నల్లగా ఉంటుందని, గొంతు గంభీరంగా ఉంటుందని మస్క్ తెలిపారు. సీఈవోగా బాధ్యతలు నిర్వహించేందుకు ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు. తన ముందు సీఈవో కన్నా ఫ్లోకి బాగా పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ట్విట్టర్ ను మస్క్ టేకోవర్ చేశాక అడ్వర్టయిజర్లు కంపెనీకి దూరమయ్యారు. దీంతో కంపెనీ నష్టాలు చవిచూసింది. తాజాగా అడ్వర్టయిజర్లు తిరిగొచ్చారని, ట్విట్టర్ బ్రేక్ ఈవెన్ లోకి వచ్చిందని మస్క్ వెల్లడించారు. మరోవైపు, ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎక్స్‌‌‌‌‌‌‌‌ కార్ప్‌‌‌‌‌‌‌‌లో విలీనం చేసినట్లు మస్క్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement