Wednesday, May 1, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా పోరాటాన్ని కొన‌సాగిస్తాం.. తోట చంద్ర‌శేఖ‌ర్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటంలో విజ‌యం సాధించార‌ని, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఏపీ పార్టీలు ప్రయత్నించకపోయినా కేసీఆర్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారని తోట చంద్రశేఖర్ వెల్లడించారు. కేసీఆర్ మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది చనిపోయారన్న సంగతి ఆయన గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి కాపాడేందుకు ఆంధ్ర పార్టీలు ప్రయత్నించడం లేదని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుండి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలిపారు. కేసీఆర్ బిడ్ వేసేందుకు సిద్ధ‌ప‌డ‌డం వ‌ల్లే కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement