Wednesday, May 15, 2024

Breaking | తెలంగాణ‌లో ఎన్నికలకు కసరత్తు.. టీముల‌ను పంపిన సీఈసీ

తెలంగాణ‌లో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏర్పాట్లు చేసేందుకు ముంద‌స్తు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. రాబోయే జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌కి, దాని నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై సమీక్ష చేప‌ట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ‌కు ఢిల్లీ నుంచి ముగ్గురు సీనియర్ అధికారుల బృందాన్ని పంప‌నుంది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అనేదానిపై చర్చ జ‌రిపిన అధికారులు.. ఓటింగ్ శాతం పెంచేందుకు చేపట్టాల్సిన కార్యకరమాలపై దృష్టిపెట్టారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో ప‌ర్య‌టించి ఓట‌ర్ల జాబితా ఫైన‌ల్ చేయ‌డం, ఎటువంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement