Monday, May 6, 2024

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. నేడు వరంగల్ లో భారీ సభ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేటి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వరంగల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. సభకు సంబంధించి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ‘రైతు సంఘర్షణ సభ’ పేరుతో నిర్వహించనున్న ఈ సభను రాష్ట్ర కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో జవసత్వాలను నింపుతుందని, ఎన్నికల దిశగా కదం తొక్కేలా స్ఫూర్తిని నింపుతుందని పీసీపీ భావిస్తోంది.

రాహుల్ సభను విజయంతం చేసేందుకు పీసీసీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. భారీగా జన సమీకరణకు ప్లాన్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) సమావేశాన్ని సజావుగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది, ఇది కేవలం కష్టాల్లో ఉన్న రైతుల కోసం మాత్రమే అంకితం చేయబడిన చారిత్రాత్మక సంఘటనగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రైతు సంఘర్షణ సభ జరిగే హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే ప్రజల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డ్రాప్‌, పార్కింగ్‌ పాయింట్ల వివరాలతో కూడిన రూట్‌ మ్యాప్‌ను నిర్వాహకులు విడుదల చేశారు.

మరోవైపు రాహుల్ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్ కు వ్యక్తిగతంగా ఎన్ఎస్జీ కమెండోలు సెక్యూరిటీగా ఉంటారు. ఎన్ఎస్జీ కమెండోలు వేదిక చుట్టూ వలయంలా ఉంటారు. వరంగల్ కు సుమారు 50 మంది కమెండోలు వచ్చినట్టు తెలుస్తోంది. బాంబు స్క్వాడ్, డాగ్ స్పైడర్ తో పర్యవేక్షణ ఉంటుంది. దీనికి తోడు వరంగల్ పోలీసులు పెద్ద సంఖ్యలో రాహుల్ భద్రత విధుల్లో ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement