Sunday, April 28, 2024

Breaking: మహారాష్ట్రలో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్ నాథ్ షిండే..

మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ను ప్రకటించారు. ఏక్ నాథ్ సిండే నే ముఖ్యమంత్రి అని స్వయంగా ఫడ్నవీస్ తెలిపారు. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఫడ్నవీస్ ప్రకటించారు. బాలాసాహెబ్ ఆశయాలను షిండే ముందుకు తీసుకెళ్తారన్నారు. రాత్రి 7.30 గంటలకు షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ముందుగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అని, డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే అని పేర్లు బయటకు వచ్చాయి. అయితే గవర్నర్ ను కలిసి వచ్చాక.. ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అంటూ ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. రెబల్స్ ఆధ్వర్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement