Friday, March 29, 2024

మేజ‌ర్ -ఓటీటీలో రిలీజ్ -ఎప్పుడంటే

రీసెంట్ గా రిలీజ్ అయి సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన చిత్రం మేజ‌ర్. ఈ చిత్రాన్ని శ‌శికిర‌ణ్ తిక్క డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో యంగ్ హీరో అడివిశేషు న‌టించాడు. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. మేజ‌ర్ పాత్ర‌లో అడివి శేష్ జీవించాడు. శేష్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుండి ‘మేజ‌ర్’ చిత్రం స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌కటించారు. థియేట‌ర్‌లో విడుద‌లైన 30రోజుల‌కు డిజిట‌ల్‌లో విడుద‌ల‌వుతుంది. బ‌యోగ్రాఫీక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంట‌ర్టైన‌మెంట్స్‌, సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయ‌స్ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌కాష్ రాజ్‌, రేవ‌తి, శోభితా ధూళిపాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌స్తుతం అడివిశేష్ న‌టించిన హిట్-2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. గూఢాచారి-2 ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement