Saturday, April 27, 2024

సీఎం హేమంత్ సోరెన్ కి ఈడీ నోటీసులు..గురువారం విచారణకి హాజరుకావాలని ఆదేశాలు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో గురువారం విచారణకు హాజరుకావాలని తెలిపింది. ఇదే కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 బ్యాంకు అకౌంట్లలో రూ.13.32 కోట్ల నగదును సీజ్‌ చేశారు.మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి పూజా సింఘాల్‌ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించింది. కాగా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంగం సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement