తెలంగాణ రాష్ట్రం గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఈసీ నోటీసులిచ్చింది. యూపీ ఎన్నికల్లో బీజేపీకి, యోగికి ఓటు వేయని వారిని గుర్తించి వారి ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించి కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసిందని.. మూడో విడత పోలింగ్లో కచ్చితంగా హిందువులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. యూపీ ఎన్నికల్లో హిందువులందరూ..ఏకం కావాలని..హిందువులంతా యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేయాల్సిందేనని.. పిలుపునిచ్చారు. ఎన్నికల్లో యోగీకి ఓటు వేయనివారంతా ద్రోహులు అని..వారికి ఉత్తర ప్రదేశ్లో స్థానం లేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో యోగీ ఆదిత్యానాథ్ కు ఓట్లు వేయని వారిని గుర్తిస్తామని రాజాసింగ్ అన్నారు. యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. సెక్షన్ 171 కింద రాజాసింగ్ కు నోటీసులిచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital