Thursday, May 16, 2024

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. ఎక్సైజ్ పోలీసులపై మందుబాబులు దాడి

నిజామాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడి చేయడానికి వెళ్లిన ఆబ్కారీ పోలీసులపై మందు బాబులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం పురాణీపేట్‌ శివారులో నాటు సారా విక్రయ కేంద్రాలు నిర్వహిస్తున్నట్ల ఎక్సైజ్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్‌ వాహనంలో పురాణీపేట్ శివారుకు వెళ్లారు. అయితే, పోలీసులను చూసిన నలుగురు మందుబాబులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అందులో ఒకరు ఎస్ఐ, కానిస్టేబుల్‌కు పట్టుబడ్డాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా పారిపోయిన ముగ్గురు మందుబాబులు పోలీసులు వాహనానికి అడ్డొచ్చారు. ఎస్ఐ, కానిస్టేబుల్‌ని బయటకు లాగి చితకబాదారు. వారిని నిలువరించేందుకు ఎస్ఐ లాఠీ దెబ్బలు కొట్టగా మందుబాబులు ఆ లాఠీని లాక్కుని దానితోనే ఎస్‌ఐని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై భీమ్‌గల్‌ పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement