Thursday, May 2, 2024

టాప్ 10మీడియా సంస్థ‌ల ఆదాయంలో ముందున్న ఫేస్ బుక్ .. గూగుల్ ..

బ్రౌజింగ్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయాన్ని ప‌రిశీలిస్తే మీడియా సంస్థ‌ల‌పై గూగుల్ ,ఫేస్ బుక్ పై చేయిలో ఉంది. ఫేస్ బుక్ , గూగుల్ బ్రౌజింగ్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంలో ముందుకు దూసుకువెళ్తున్నాయి. భారత్ లో టాప్ 10 మీడియా సంస్థల ఆదాయంతో పోలిస్తే ఫేస్ బుక్, గూగుల్ ఆదాయం మూడు రెట్లు ఎక్కువగా ఉందని తేలింది.ఆన్ లైన్ మాధ్యమాల్లో వచ్చే మొత్తం డిజిటల్ యాడ్స్ లో 80 శాతం ఫేస్ బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకే వెళ్తున్నాయి. 2020-21 ఏడాదిలో ఈ రెండు కలిపి రూ.23,213 కోట్లు ఆర్జించగా.. భారత్ లో టాప్ 10 మీడియాలు ప్రకటనల ద్వారా రూ.8396 కోట్లను మాత్రమే ఆర్జిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement