Wednesday, May 15, 2024

పార్టీ సంబరాల్లో మునిగితేలుతోన్న కేసీఆర్ – మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ కి డుమ్మా-అరవింద్ ట్వీట్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంల‌తో కోవిడ్ పై వీడియో కాన్ఫ‌రెన్స్ ని నిర్వ‌హించారు. ఈ కాన్ఫ‌రెన్స్ కి తెలంగాణ సీఎం కేసీఆర్ రాలేద‌ని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు మన దేశ్ కి నేత కేసీఆర్.. టిఆర్ఎస్ పార్టీ సంబరాల్లో మునిగి తేలుతూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహిస్తున్న కోవిడ్ రివ్యూ మీటింగ్ కు అత్యవసరంగా డుమ్మా కొట్టిండట” అంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పెట్రోల్ ధరలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రాలు కేంద్రం ఇంధన ధరలపై వ్యాట్ తగ్గించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ట్యాక్సులు తగ్గించడం లేదని ప్రధాని దుయ్యబట్టారు.ఇలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కామెంట్ చేశారు.మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్,కేరళ, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు పన్నులు తగ్గించడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement