Friday, May 3, 2024

మ‌హిళ‌పై దాడి-కారుతో ఈడ్చుకెళ్లి రోడ్డుపై విసిరేసిన మాన‌వ మృగాళ్ళు

రోజు రోజుకి మ‌హిళ‌ల‌పై దాడులు జ‌ర‌గ‌డం ప‌రిపాటిగా మారింది. నిత్యం ఎక్క‌డో ఒక‌చోట మ‌హిళ‌లని హింసిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ద‌క్షిణ‌ ఢిల్లీలోని అమర్ కాలనీలో న‌డిరోడ్డుపై ఓ మ‌హిళ‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణంగా దాడిచేశారు. ఇద్ద‌రు డ్రైవ‌ర్లు ఆమెపై దాడి చేయ‌డంతో పాటు కొంత దూరం కారుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. న‌డిరోడ్డుపైకి విసిరేశారు. గాయాల‌తో ఆ మ‌హిళ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. పోలీసులు ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభిచారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలిపై దాడి చేయ‌డంతో పాటు కొంత దూరం కారుతో ఈడ్చుకెళ్లార‌ని తెలిపింది. ఆ త‌ర్వాత కారు వేగంగా పోతుండ‌గానే.. తోసేశార‌నీ, తీవ్ర‌గా గాయ‌ప‌డ్డాన‌ని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement