Friday, April 19, 2024

డ‌బ్బులు డిమాండ్ చేసిన‌ డాక్టర్‌పై చర్యలు : మంత్రి రజిని

పోస్టుమార్టం కోసం డ‌బ్బులు డిమాండ్ చేసిన డాక్ట‌ర్ పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ అన్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం కోసం డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంపై మంత్రి విడదల రజినీ స్పందించారు. పోస్టుమార్టం కోసం లంచం డిమాండ్ చేయ‌డం అమాన‌వీయమని ఆమె చెప్పుకొచ్చారు. నిరుపేద కుటుంబం నుంచి రూ.16 వేలు లంచం డిమాండ్ చేసిన‌ డాక్టర్ సంధాని బాషాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement