Thursday, May 2, 2024

Big Breaking | బోటు ప్రమాదంలో మరో నలుగురు మృతి.. 15కు పెరిగిన మృతుల సంఖ్య..

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బోటు బోల్తా కొట్టడంతో తొలుత 9మంది జలసమాధి కాగా, ఆ తర్వాత మృతుల సంఖ్య 15కి చేరింది. ఈ ఘటన మలప్పురం తన్నూర్​ బీచ్​ దగ్గర ఇవ్వాల (ఆదివారం) కొద్దిసేపటి క్రితమే జరిగింది.

టూరిస్టు బోటు బోల్తా పడడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 15 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో బోటులో 40 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. బోటు ప్రమాదం విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement