Tuesday, May 7, 2024

ముంబైని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన సీఎస్కే… ధోనీ టీమ్ టార్గెట్ 140

చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో ఈరోజు చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులు చేసింది. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు బ్యాట్స్ మెన్లు నేహ‌ల్ వ‌ధేరా 64 ప‌రుగులు చేయ‌గా, సూర్య‌కుమార్ యాద‌వ్ 26 ప‌రుగులు, స్టబ్స్ 20 పరుగులు చేశారు. అలాగే చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్లు విజృంభించారు. ముంబై జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. చివరి ఓవర్ లో పతిరన తక్కువ స్కోరు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో సీఎస్కే జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 120 బంతుల్లో 140 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement