Saturday, May 4, 2024

అపార్ట్ మెంట్ ఆవ‌ర‌ణ‌లో మొస‌ళ్లు-రంగంలోకి దిగిన అట‌వీ సిబ్బంది

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌తో విశ్వామిత్ర న‌ది పొంగి ప్ర‌వ‌హిస్తోంది. కాగా ఈ న‌దిలో 250మొస‌ళ్లు ఉన్నాయి. న‌దికి వ‌ర‌ద‌లు రావ‌డంతో ఆ నీరు గుజ‌రాత్ లోని వ‌దోద‌ర లోత‌ట్టు ప్రాంతాల‌ను ముంచెత్తింది. కాగా వ‌ర‌ద నీటితో పాటు మొసళ్లు కూడా పట్టణంలోకి కొట్టుకువచ్చాయి. అపార్ట్ మెంట్ వాసులు.. తమ ఇంటి ఆవరణలోకి మొసళ్లు వచ్చాయంటూ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వాటిని పట్టుకునేందుకు పలు బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇలా కొట్టుకువచ్చిన మొసళ్లలో చిన్నవి, పెద్దవి కూడా ఉన్నాయి. డ్రైనేజీల్లో ఎన్నో కిలోమీటర్ల మేర అవి కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పలు ప్రాంతాల్లో మొసళ్లను బంధించి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement