Friday, April 19, 2024

ఏపీలో క్రైమ్.. చికెన్, మటన్ లాగా మనిషి మాంసం

ఏపీలో ఒకేరోజు పలు మర్డర్ సీన్లు బయటపడ్డాయి. విశాఖ జిల్లాలో ఒకేరోజు రెండు దారుణాలు చోటుచేసుకున్నాయి. ఓ ఇంట్లో నలుగురిని సజీవదహనం చేయగా.. మరో ఇంట్లో ఆరు హత్యలు జరిగాయి. ఈ దారుణాలను మరువకముందే మరో జిల్లాలో దారుణం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా కుప్పం రహదారిలో ఓ లగేజ్ బ్యాగ్‌లో అర్ధ శరీరం ఉన్న కళేబరాన్ని పోలీసులు గుర్తించారు.

దీంతో సోషల్ మీడియాలో ఏపీలో జరుగుతున్న మర్డర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మటన్, చికెన్ లాగా ఏపీలో మనిషి మాంసం కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోందని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఏపీలో గత కొంతకాలంగా క్రైమ్ రేటు పెరిగిపోయిందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రజల భద్రత కోసం కాకుండా రాజకీయ నేతల చెప్పుచేతల్లో పనిచేస్తున్నారంటూ కొందరు మండిపడుతున్నారు. దీంతో ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement