Saturday, April 20, 2024

గ్రామస్తులకు మాస్కులు పంపిణీ..

కాసిపేట: మండలంలోని రేగులగూడెం గ్రామంలో స్థానిక పోలీస్‌ సిబ్బంది గ్రామస్తులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్సై వెంకన్న మాట్లాడుతూ కరోనా విజృంభిస్తుందని, ప్రతీఒక్కరు ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పటేల్‌ కుర్సింగ సోనేరావు, ఆశా కార్యకర్త శోభారాణి, పోలీస్‌ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement