Saturday, April 27, 2024

నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలువురికి కరోనా వైరస్ సోకడంతో కొందరు విద్యార్థులను ట్రిపుల్ ఐటీ అధికారులు ఇంటికి పంపించారు. ఇప్పటికే కరోనా సోకి ట్రిపుల్ ఐటీ లాబ్ అసిస్టెంట్ లీలా మురళి కృష్ణ(42) మరణించారు. ఇతనికి భార్య, ద్దరు పిల్లలు ఉన్నారు. రెండు రోజుల క్రితం మురళి కృష్ణ చనిపోయాడు. ఈ నెల 26న ట్రిపుల్ ఐటీ అధికారులు 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్ష రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. కాగా కరోనా విలయతాండవం చేస్తున్నా సిబ్బంది యధావిధిగా విధులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా వైరస్ తీవ్రత ఇంకా పెరగకముందే ట్రిపుల్ ఐటీ అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు ట్రిపుల్ ఐటీ సిబ్బంది కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement