Friday, April 26, 2024

కరోనా టెర్రర్.. గ్రేటర్ హైదరాబాదులో 82 కేసులు

తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గింది. గడచిన 24 గంటల్లో 1,05,201 కరోనా పరీక్షలు నిర్వహించగా, 569 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 657 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 64, వరంగల్ అర్బన్ జిల్లాలో 51, ఖమ్మం జిల్లాలో 40 కేసులు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు 6,48,957 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,36,552 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,582 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,823కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement