Monday, May 6, 2024

త‌గ్గుముఖం ప‌డుతోన్న క‌రోనా కేసులు – వివ‌రాలు ఇవే

క‌రోనా కేసులు రోజు రోజుకి త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కాగా కొత్త‌గా 15,102కేసులు న‌మోద‌యిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి నిన్న 31,377 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల నిన్న‌ 278 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. దేశంలో ప్ర‌స్తుతం 1,64,522 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నార‌ని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంద‌ని తెలిపింది. క‌రోనా నుంచి మొత్తం 4,21,89,887 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. మొత్తం మృతుల సంఖ్య 5,12,622గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 176,19,39,020 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement