Saturday, May 18, 2024

ఏపీలో గ‌డ‌చిన 24గంట‌ల్లో క‌రోనా కేసుల వివ‌రాలు

గ‌డ‌చిన 24గంట‌ల్లో ఏపీలో 25,086క‌రోనా శాంపిల్స్ ప‌రీక్షించ‌గా, 82మందికి పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. కాగా అత్య‌ధికంగా చిత్తూరు జిల్లా 23, నెల్లూరు జిల్లాలో 11 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఇక విజ‌య‌న‌గ‌రం, క‌డ‌ప జిల్లాల్లో కొత్త కేసులు న‌మోదు కాలేదు. 164 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,492 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,60,836 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,166 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,490కి పెరిగింది. మ‌రోప‌క్క ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే న‌మోద‌వుతున్నాయి ప‌లు ప్రాంతాల్లో.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement