అసలే మే.. ఆపై ఎండలు దంచికొడుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడుతున్నారు చాలామంది. అట్లాంటి టైమ్లో ఇంట్లోనే ఉండి నిరంతరం ఏసీ వేసుకోవాలన్నా భయపడుతున్నారు ఇంకొంతమంది. ఎందుకంటే పెరిగిన కరెంటు బిల్లులకు తోడు.. 24 గంటలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు రన్ అవుతూ ఉంటే బిల్లు వాచిపోతోందని మొత్తుకుంటున్నారు. దీంతో కొంతమంది ఏదైనా కరెంట్ బిల్లు తగ్గించుకునే ఐడియా చెప్పండి అని ఫేస్ బుక్లో పోస్టు చేశారు.
దీనికి ఒకతను 25డిగ్రీల వద్ద ఏసీ పెడితే బాగా కూల్గా ఉంటుంది. బిల్లు కూడా తక్కువ వస్తుంది ట్రై చేయండి అని ప్లాన్ ఇచ్చాడు. ఈ ప్లాన్ని విన్న ఓ వ్యక్తి.. తన ఇంట్లో 25 డిగ్రీల లెవల్లో ఏసీని బిగించి.. ఏదీ బిల్లు తక్కువ రావడం లేదే అని క్వశ్చన్ చేశాడు.. దీంతో చిర్రెత్తుకొచ్చిన చాలామంది ఫేస్బుక్లో, ట్విట్టర్లో మామూలుగా ఆడుకోవడం లేదు. ‘‘మీ కరోనా బ్యాచ్తో చచ్చే చావొచ్చిందిరా నాయనా” అంటూ తిట్టిపోస్తున్నారు.