Monday, May 6, 2024

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే..

ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికారం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మూడో విడతలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, మహ్మద్ అజారుద్దీన్ సహా మొత్తం 30 మంది యూపీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారంలో చేయనున్నారు.

కాగా, మొత్తం 410 సీట్ల ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతల ఎన్నికలు ఈ నెల 10న జరుగుతాయి. మార్చి 10న ఓట్లు లెక్కిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement