Monday, April 29, 2024

మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి నిసనల సెగ తగులుతోంది. నిన్న రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించారు. రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. బోయిన్‌పల్లిలో మల్లారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌ ఎస్సీ నేతలు ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మల్లారెడ్డి ఇంటికి చేరుకుని కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 20 మంది కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు మల్లారెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాాగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్రక్రమం చేపట్టనున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అదేవింధంగా మంత్రి మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్ లలో కంప్లైంట్ ఇవ్వనున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇది కూడా చదవండి: Petrol price: పెట్రోల్ బంక్ లో బైక్ దగ్దం చేసి నిరసన..

Advertisement

తాజా వార్తలు

Advertisement