Friday, May 10, 2024

Breaking: ఇంటిగోడ కూలి.. ఐదుగురు దుర్మరణం

ఇంటి గోడకూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెంందిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌ కాంకేర్ జిల్లాలో చోటు చేసుకున్నది. జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పఖంజోర్ ప్రాంతంలోని ఇర్పనార్ గ్రామంలో ఇంట్లో నివసిస్తున్న సమయంలో మట్టిగోడ కూలిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలు సైతం ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement