Saturday, April 27, 2024

Breaking: మెట్రో రైళ్ల వేగం పెంపునకు సీఎంఆర్ఎస్ అనుమతి

మెట్రో రైళ్ల వేగం పెంచేందుకు సీఎంఆర్ఎస్ అనుమతి ఇచ్చింది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల పెంపునకు అనుమతి ఇచ్చింది. మెట్రో రైళ్ల వేగం, భద్రతపై మార్చి 28, 29, 30న తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. మెట్రో రైళ్ల వేగం పరిమితి పెంపుతో ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. నాగోలో – రాయదుర్గం వద్ద ఆరు నిమిషాలు, మియాపూర్ – ఎల్బీ నగర్ మధ్య నాలుగు నిమిషాలు, జేబీఎస్ – ఎంజీబీఎస్ మధ్య ఒకటిన్నర నిమిషాల సమయం ఆదా అవుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement