Monday, May 6, 2024

Breaking: సీఎం కేసీఆర్​ ఏరియల్​ సర్వే షెడ్యూల్​ ఖరారు.. అధికారులకు అందిన ఇన్​స్ట్రక్షన్స్ ఇవే..​

సీఎం కేసీఆర్​ రేపు, ఎల్లుండి పర్యటించే టూర్​ షెడ్యూల్​ ఖరారైంది. ఈ మేరకు ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు దీనికి సంబంధించిన ఆదేశాలు అందాయి. ఇవ్వాల (శనివారం) హనుమకొండ జిల్లాకు రోడ్డు మార్గం ద్వారా చేరిన ముఖ్యమంత్రి రాత్రికి అక్కడే కెప్టెన్​ లక్షీకాంతరావు ఇంట్లో బస చేయనున్నారు. ఇక.. రేపు (ఆదివారం) ఉదయం 7 గంటలకు హెలిక్యాప్టర్​ ద్వారా బయలుదేరి.. 7.45కు భద్రాచలం, కొత్తగూడెం జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్​ సర్వే చేస్తారు. 9.30కి భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి బయలుదేరి 9.45కి ఏటూరు నాగారం, ములుగు జిల్లా పరిధిలోని వరద ఎఫెక్టివ్​ ప్రాంతాలను పరిశీలిస్తారు. అయితే.. ఈ రెండు చోట్ల కూడా అధికారులతో భేటీ అయ్యి… సహాయక చర్యలపై సమీక్ష చేయనున్నారు.

ఇక.. 11 గంటలకు ఏటూరునాగారం నుంచి బయలుదేరి 11.45కు సికింద్రాబాద్​లోని బేగంపేటకు చేరుకుంటారు. ఆ తర్వాత మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష ఉంటుంది. మరుసటి రోజు (సోమవారం) గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూలు తర్వాత రిలీజ్​ చేస్తామని అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement