Monday, April 29, 2024

నేడు నల్గొండలో సీఎం కేసీఆర్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు న‌ల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాద‌రి కిషోర్ కుమార్ తండ్రి మార‌య్య ద‌శ దిన‌క‌ర్మ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద సీఎం నివాళులు అర్పించనున్నారు. 

సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ లో న‌ల్గొండ‌కు వెళ్తారు. న‌ల్గొండ‌లోని ఎన్జీ క‌ళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ పై 12 గంట‌ల‌కు ల్యాండ్ అవుతారు. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో ఎమ్మెల్యే గాద‌రి కిషోర్ ఇంటికి చేరుకుంటారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కుటుంబాన్ని పరామ‌ర్శిస్తారు. అనంత‌రం అక్క‌డే మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసి తిరిగి హైద‌రాబాద్ కు ప్ర‌యనం అవుతారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement