Wednesday, April 24, 2024

Covid-19: టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావుకు కరోనా

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు కరోనా బారిన పడ్డారు. నిన్న (డిసెంబర్ 28) స్వల్ప లక్షణాలు బయటపడటంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో కేశవరావుకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు క్వారెంటైన్‌లోకి వెళ్లారు.

కాగా, వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంతో చర్చించేందుకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీల బృందం ఇటీవల ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ తర్వాత చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా కేశవరావు కూడా కరోనా బారినపడటం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement