Friday, May 17, 2024

కర్నాటక రోడ్డుప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

ఈరోజు ఉదయం కర్నాటక టక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును మినీ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఈ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాద్‌ వాసులు మృతి చెందడపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement