Friday, April 26, 2024

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతి పట్ల‌ సీఎం కేసీఆర్‌ సంతాపం

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి ఈరోజు ఉదయం మృతిచెందారు. మోటారు సైకిల్‌ పైనుంచి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో మరణించారు. ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్‌ సమస్య అనగానే స్వామి పేరు గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంశాల స్వామికి మంత్రి కేటీఆర్‌ ఇల్లు కట్టించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement