Friday, May 3, 2024

చైనా వ్యాక్సిన్ల‌తో ఏ మాత్రం ఉప‌యోగం లేదు.. ట్వీట్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా

చైనాలో గ‌త కొన్నిరోజులుగా ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌రోనా కొత్త కేసులు వ‌స్తున్నాయి. దాంతో చైనా నగరాల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని, శ్మశానవాటికల్లో విపరీతమైన రద్దీ నెలకొందని కథనాలు వెలువడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా సోష‌ల్ మీడియాలో ఫొటోలు దర్శనమిస్తున్నాయి. దీనిపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఓ ఆసుపత్రిలో బెడ్ లు ఖాళీగా లేక, కరోనా రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్స ఇస్తున్న ఓ ట్వీట్ ను ఆయన పంచుకున్నారు.

దానిపై వ్యాఖ్యానిస్తూ… చైనా వ్యాక్సిన్లతో ఏమాత్రం ఉపయోగం లేదన్న విషయం తేలిపోయిందని వివరించారు. చైనా వ్యాక్సిన్లు కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని అందించలేకపోతున్నాయన్న విషయం స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం మంచి పొరుగుదేశంగా వ్యవహరించలేమా.. సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వంటి సంస్థల నుంచి వ్యాక్సిన్లను చైనాకు అందజేయలేమా..ప్రస్తుతం మన వద్ద తగినంతగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయి కదా అని ఆనంద్ మహీంద్రా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement