Monday, May 20, 2024

ఛూ మంతర్ మాయ….

ఛూ మంతర్‌ అంటూ మంత్రగాడు మంత్రం వేసి మాయ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే. ఇలా మాయ చేయటానికే బి.కల్యాణ్‌ కుమార్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ వెంకట్‌ కిరణ్‌ కుమార్‌ కాళ్లకూరి నిర్మాతగా చరణ్‌ లక్కరాజు, యశశ్రీ జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘ఛూ మ ంతర్‌’. ఈ సినిమా ఫిలింనగర్‌లోని ఓ కాఫీషా పులో లాంచనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశా నికి ఎబిసిడి చిత్ర దర్శకుడు సంజీవ్‌రెడ్డి క్లాప్‌నివ్వగా నిర్మాత కిరణ్‌ తల్లి శ్రీలక్ష్మీ కెమెరా స్విచాన్‌, ‘ఉరి’ చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సంద ర్భంగా నిర్మాత మాట్లాడుతూ ”తొలిషెడ్యూల్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమౖౖెందని గతంలో తన బ్యానర్‌లో గ్రే అనే సినిమాను నిర్మించానని ఆ చిత్రం మే 26న విడుదల వ్వనుందని తెలిపారు.

అలాగే హాష్‌టాగ్‌ కృష్ణారామ అనే చిత్రాన్ని నిర్మించా ను. ఛూ మంతర్‌ చిత్రం ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇది మూడవ సినిమా అన్నారు. ఈ చిత్రంలో ‘బలగం’ ఫేమ్‌ రూపాలక్ష్మీ, చిత్రం శ్రీను యోగి కత్రి, జబర్దస్త్‌ కుమరం, గడ్డం నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు : సందీప్‌, పల్లవి, రవి సంగీతం: సుధా శ్రీనివాస్‌, గీతాలు: కాసర్ల శ్యామ్‌, చాందిని, కెమెరా: మధుసూదన్‌ కోట.

Advertisement

తాజా వార్తలు

Advertisement