Friday, May 3, 2024

టికెట్ల ధ‌ర‌ల‌ను ఫైన‌ల్ చేస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం ..

ఆన్ లైన్ లో టికెట్ల ధ‌ర‌ల‌ను ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ రిలీజ్ చేసింది. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, న‌గ‌ర పంచాయితీ, గ్రామ‌పంచాయ‌తీ ఏరియాల వారీగా టికెట్ల ధ‌ర‌ల‌ను ఫిక్స్ చేసింది. అంతేకాదు ఈ టికెట్ల ధ‌ర‌ల‌ను ఫైన‌ల్ చేస్తూ జీవో కూడా జారీ చేయ‌డం విశేషం. ప్రతిరోజు కేవలం నాలుగు షోలు మాత్రమే నిర్వహించాలని… ప్రభుత్వం ఖరారు చేసిన ధరలకే ఇకనుంచి సినిమా టికెట్లు అమ్మ నున్నట్టు జీవోలో పేర్కొంది. ఇక నుంచి టికెట్లు ఆన్ లైన్ లోనే తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కాగా టిక్కెట్ల ధరలను పెంచాలని నిర్మాతలు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మ‌రి ఈ నేప‌థ్యంలో టికెట్ల ధ‌ర‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ఫిక్స్ చేయ‌డంపై ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement