Tuesday, April 23, 2024

విందు భోజనం పెట్టలేదని… గాల్లోకి కాల్పులు!

న్యూఢిల్లీ-బంధువుల పెళ్లికి ఎంతో ఉత్సాహంగా వస్తే భోజనం పెట్టరా.. ఎంత కండకావరం అంటూ ఓ వ్యక్తి వీరంగం చేశాడు. లక్షలకు లక్షలు వసూలు చేస్తూ అతిథులకు విందు పెట్టకపోతే ఎలా అంటూ చిందులుతొక్కాడు. చివరకు పట్టరాని కోపంతో తుపాకీ బయటకు తీసి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే, అతడికి పెళ్లి విందు సంగతేమోగాని.. జైలులో చిప్పకూడు తప్పలేదు. న్యూఢిల్లీలో ఈ సంఘటన వెలుగుచూసింది. న్యూఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో తన సోదరి పెళ్లి వేడుకలకు మననీష్ అనే వ్యక్తి హాజరయ్యాడు. వేడుకంతా బాగానే జరిగింది.

చివరకు ఫంక్షన్ హాలులో విందు మొదలైంది. భోజనం చేయడానికి మనీష్ వెళ్లాడు. బాగా తాగి ఉన్న అతడు వడ్డిస్తున్నవారితో ఘర్షణకు దిగాడు. భోజనం పెట్టేందుకు వారు నిరాకరించడంతో జేబులోంచి తుపాకీ తీసి కాల్చేస్తానంటూ బెదరించి గాలిలోకి పేల్చాడు. దీంతో అందరూ భయభ్రాంతులకు గురైనారు. చివరకు కథ పోలీసులకు చేరింది. అనధికారికంగా మారణాయుధం ఉంచుకోవడం, దుర్వినియోగం చేయడం అనే అభియోగంపై నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ విషయాన్ని ఔటర్ ఢిల్లీ డీసీపీ పర్వీందర్ సింగ్ మీడియాకు చెప్పారు. నిందితుడిని ఖాళీ కాట్రిజ్డ్ స్వాధీనం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement